Wednesday, September 18, 2024
HomeతెలంగాణRythu Runa Mafi 2nd phase: రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల

Rythu Runa Mafi 2nd phase: రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల

రాజకీయ ప్రయోజనం కాదు… రైతు ప్రయోజనం ముఖ్యమని పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి అభినందనలు.

- Advertisement -

రైతు సంతోషంగా ఉండాలని 6మే 2022న వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించాం..

గత ప్రభుత్వం 60నెలలు నాలుగు విడతల్లో రూ.లక్ష రుణమాఫీ కూడా పూర్తిచేయలేకపోయారు.

గత ప్రభుత్వం రూ.25వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయింది.

అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం ఎలా రుణమాఫీ చేస్తుందని కొందరు మాట్లాడారు.

ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాల్సిందేనని ప్రణాళికలు రచించాం.. నిధులు సేకరించాం

నిధుల సమీకరణ చేసి ఇవాళ రెండో విడతలో రూ.6,198కోట్లు ఆరున్నర లక్షల మందికి మేలు జరిగేలా చేస్తున్నాం..

ఇది మా చిత్తశుద్ధి, ఇది మా నిబద్ధత

నెహ్రూ ఆనాడు హరిత విప్లవం తీసుకు వచ్చారు.

జై జవాన్, జై కిసాన్ నినాదంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లింది.

పేద రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించేందుకు ఇందిరమ్మ బ్యాంకుల జాతీయకరణ చేశారు.

సోనియమ్మ నేతృత్వంలో ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకువచ్చారు.

ఆనాడు రూ.72వేల కోట్లు రుణాలు మాఫీ చేసి దేశంలో రైతులను ఆదుకుంది కాంగ్రెస్.

అప్పుడు .. ఇప్పుడు ఎప్పుడూ కాంగ్రెస్ రైతు పక్షపాతి.

నెల తిరిగేలోగా 1.5లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.

అగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతులను రుణ విముక్తులను చేస్తాం.

జూలై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖించదగ్గ నెలలు.

దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ రికార్డు సృష్టించింది.

స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్దమొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదు.

గత బీఆరెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ఆరునెలల్లో ఆర్ధిక మంత్రి రూ.43 వేల కోట్లు వడ్డీ చెల్లించారు.

12 రోజుల్లోనే రుణమాఫీకి 12వేల కోట్లు సేకరించిన ఆర్ధిక మంత్రి, వారి సిబ్బందిని అభినందిస్తున్నా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News