Sunday, July 7, 2024
HomeతెలంగాణRythubandhu: మూడో రోజు రైతుబంధు 1325.24 కోట్లు

Rythubandhu: మూడో రోజు రైతుబంధు 1325.24 కోట్లు

50.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.3246.42 కోట్లు జమ

మూడో రోజు రైతుబంధు రూ.1325.24 కోట్లు విడుదల చేసినట్టు తెలంగాణ సర్కారు వెల్లడించింది. 10.89 లక్షల రైతుల ఖాతాలలో జమ అయినట్టు, ఇప్పటి వరకు 50.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.3246.42 కోట్లు జమ అయ్యాయని సర్కారు తెలిపింది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో పథకాల అమలవుతున్నాయని, వ్యవసాయం, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అందుకే జనాభాలో అధిక శాతం ఆధారపడిన వ్యవసాయరంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనిస్తున్నట్టు వివరించారు మంత్రిసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News