Friday, September 20, 2024
HomeతెలంగాణSaidireddy: మళ్లీ మనమే గెలుస్తాం

Saidireddy: మళ్లీ మనమే గెలుస్తాం

గడప గడపకు శానంపూడి

ప్రజలకు అభివృద్ధి జరగాలంటే మళ్ళీ కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని హుజూర్ నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేరేడుచర్ల పట్టణంలోని ఏడో వార్డు, దిర్శించర్ల గ్రామంలో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులతో అపూర్వ స్వాగతం పలికారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మంచి పనులెన్నో చేశామని, బిఆర్ఎస్ గెలిస్తేనే అందరికీ అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందన్నారు. హుజుర్ నగర్ లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News