Salman Khan investment of Rs. 10 thousand crores in Telangana: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ సందర్భంగా ఆయనకు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా అత్యాధునిక ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్తో పాటు, ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ను సైతం నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ను రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు వద్ద ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజున (డిసెంబర్ 8) రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. సల్మాన్ ఖాన్ వెంచర్స్ నిర్మించబోయే ఈ టౌన్షిప్ కేవలం నివాస సముదాయం మాత్రమే కాకుండా, అనేక ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ గ్రౌండ్ సౌకర్యాలను కూడా కలిగి ఉంటుంది. ఛాంపియన్షిప్ గోల్ఫ్ కోర్సు, హై-ఎండ్ వినోద సౌకర్యాలు, రేస్ కోర్సు, పర్యావరణపరంగా రూపొందించిన నేచర్ ట్రైల్స్, ప్రీమియం రెసిడెన్షియల్ స్థలాలు ఇందులో ఉంటాయి. ఈ కాంప్లెక్స్లో పెద్ద-ఫార్మాట్ ప్రొడక్షన్లు, ఓటీటీ కంటెంట్ను క్రియేట్ చేసుకునేలా అన్ని సౌకర్యాలు ఉంటాయి. పోస్ట్-ప్రొడక్షన్ విభాగాలతో కూడిన అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో కూడా ఉంటుంది. ఈ టౌన్షిప్లో ఛాంపియన్షిప్ గోల్ఫ్ కోర్సు, హై-ఎండ్ విశ్రాంతి సౌకర్యాలు, రేస్ కోర్సు, క్యూరేటెడ్ నేచర్ ట్రైల్స్, ప్రీమియం రెసిడెన్షియల్ స్థలాలు ఉంటాయి. ఫిల్మ్ స్టూడియోలో పెద్ద ఫార్మాట్ ప్రొడక్షన్లు, ఓటీటీ కంటెంట్, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు, టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలకు మద్దతు ఇవ్వడానికి అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయనుంది.
భారీ ఉద్యోగాలు లభించే అవకాశం..
ఈ ప్రాజెక్టు ద్వారా భారీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దేశంలోనే చలనచిత్ర నిర్మాణం, వినోదం, లగ్జరీ పర్యాటకానికి తెలంగాణ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా మారనుందని ఆ సంస్థ ప్రతినిథులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ అమలుకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏదేమైనా, ఈ భారీ పెట్టుబడి తెలంగాణ క్రియేటివ్, ఆర్థిక రంగానికి రాబోయే దశాబ్దానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ఇదిలా ఉంటే, తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ట్రంప్ మీడియా టెక్నాలజీస్ ముందుకొచ్చింది. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో ట్రంప్ మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్ కీలక ప్రకటన చేశారు. వచ్చే పదేళ్లలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.

