Monday, May 19, 2025
HomeతెలంగాణSambhipur Raju: సాయికృష్ణ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం

Sambhipur Raju: సాయికృష్ణ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం

సాయికృష్ణ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ వార్డు పరిధిలోని సాయికృష్ణ కాలనీ, చందు లే అవుట్, ఆర్ కే లే అవుట్, ఎన్ఆర్ఐ కాలనీ, అపురూప కాలనీలలో ఎమ్మెల్సీ మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్ తో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా స్థానికంగా డ్రైనేజీ సమస్యతో పాటు మౌళిక వసతులు కల్పించాలని స్థానికులు వినతిపత్రాలు అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ ఇంచార్జి కమిషనర్ రామకృష్ణ, నిజాంపేట్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, కార్పొరేటర్లు శ్రీనివాస్ యాదవ్, బాలాజీ నాయక్, సురేష్ రెడ్డి, నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు దయాకర్ రెడ్డి, బౌరంపేట్ కౌన్సిలర్ మురళి యాదవ్, నిజాంపేట్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాంబశివారెడ్డి, డివిజన్ పార్టీ అధ్యక్షులు చందు, ఉపాధ్యక్షులు భాస్కర్, నాయకులు వెంగయ్య చౌదరి, జగన్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పార్టీ నాయుకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News