Saturday, July 6, 2024
HomeతెలంగాణSangareddy: కాంగ్రెస్ కు అంతా అనుకూలంగా ఉంది

Sangareddy: కాంగ్రెస్ కు అంతా అనుకూలంగా ఉంది

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్

మెదక్ పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి అన్నారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ సెక్రెటరీ, మెదక్ పార్లమెంటు ఇంచార్జ్ విశ్వనాద్ తో కలిసి దీపాదాస్ మున్షి ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి ఎంపీ అభ్యర్థి నీలం మధు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సంగారెడ్డి డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా దీపదాస్ మున్షి ఎన్నికల వేళ స్ట్రాటజీ ఎలా ఉండాలన్న దానిపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలకు కొద్దిరోజులే గడువు ఉందని, ఈ పది రోజులు శ్రమించాలని సూచించారు. అలాగే కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో పటాన్ చెరు ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, గజ్వేల్ ఇన్చార్జి తూముకుంట నర్సిరెడ్డి, దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, సిద్ధిపేట ఇంచార్జి ఇన్చార్జి పూజల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News