Sunday, July 7, 2024
HomeతెలంగాణSankarpalli: శంకర్ పల్లి మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు

Sankarpalli: శంకర్ పల్లి మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు

నూతన మున్సిపాలిటీగా ఏర్పడిన శంకర్ పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ ను ఆహ్వానించారు. కాలే యాదయ్య శంకర్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు ఇమ్మని కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ శంకర్పల్లి అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీనితో కృతజ్ఞతలు తెలపడానికి హైదరాబాద్ ప్రగతి భవన్ లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News