Sunday, September 8, 2024
HomeతెలంగాణSanthosh to get Karimnagar MP ticket?: కరీంనగర్ ఎంపీ బరిలో సంతోష్ కుమార్?

Santhosh to get Karimnagar MP ticket?: కరీంనగర్ ఎంపీ బరిలో సంతోష్ కుమార్?

అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ హవా నడుస్తుంది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు అధిష్టానం దగ్గర తమకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలంటూ విన్నవించుకుంటున్నారు. అధిష్టానం కూడా అభ్యర్థి ఎంపికలో పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటుండడంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా అందరికీ సుపరిచితుడైన సంతోష్ కుమార్ నే బరిలో నిలిపేందుకు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. కౌన్సిలర్ గా రాజకీయాల్లోకి వచ్చిన టి.సంతోష్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ లో వివిధ స్థాయిలో పని చేశారు. మొదటి నుంచి కరీంనగర్ కాంగ్రెస్ కంచుకోట. ఇక్కడి నుంచి పలు మార్లు కాంగ్రెస్ అభ్యర్థులు పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సంతోష్ కుమార్ క్రియాశీలకంగా పనిచేశాడు.
✳️ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరివాడుగా పేరున్న నాయకుడు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అందరివాడుగా పేరున్న సంతోష్ కుమార్ కు అధిష్టానం వద్ద మంచి పేరు ఉంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతోనే అధిష్ఠానం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
✳️సంతోష్ కుమార్ అంటే తెలియని వారు లేరు
టి సంతోష్ కుమార్ అంటే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తెలియని వారు ఉండరు. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న ఆయన ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు పాత్ర పోషించారు. ఇక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వివిధ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు పని చేశారు. మధ్యలో కొన్ని రోజులు పార్టీని వీడినా కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆయన మాతృసంస్థలో చేరిన సమయంలో కరీంనగర్ పార్లమెంట్ టికెట్ పై హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆయన కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం కూడా ఈ మేరకు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ కుమార్ ను గెలిపించేందుకు శాయశక్తుల పని చేస్తామని వాగ్దానం చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించి, సోనియాగాంధీకి బహుమతి ఇస్తామని అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News