Saturday, July 6, 2024
HomeతెలంగాణSathupalli: టాప్ స్టూడెంట్స్ ను అభినందించిన సండ్ర

Sathupalli: టాప్ స్టూడెంట్స్ ను అభినందించిన సండ్ర

సత్తుపల్లి పట్టణంలో రాష్ట్రస్థాయి మార్కులు సంపాదించిన కళాశాల విద్యార్థులను, పాఠశాల విద్యార్థులను అభినందించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య , సత్తుపల్లి పట్టణంలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం నుండి స్టేట్ థర్డ్ ర్యాంకు సాధించిన విద్యార్థులు పడగల రుష్మిత 466/470, కంచు స్నేహ 466/470, అలాగే సిఎస్సి ఇంగ్లీష్ మీడియం భాగం నుండి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన కె శ్రీనిజ 978/1000 విద్యార్థులను మరియు పదో తరగతి నందు 10/10 మార్కులు సాధించిన త్రివేణి స్కూల్ విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను అభినందించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పిల్లలు ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు కోసం తన వంతు బాధ్యతగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేష్, గాయత్రి కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. సుబ్బారావు, అధ్యాపకులు అలాగే త్రివేణి స్కూల్ ప్రిన్సిపల్ వేణుగోపాలరావు, అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు, సత్తుపల్లి కార్పొరేషన్ మెంబర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News