Sunday, October 6, 2024
HomeతెలంగాణSathupalli: భారీ ర్యాలీతో సండ్ర నామినేషన్

Sathupalli: భారీ ర్యాలీతో సండ్ర నామినేషన్

గులాబీ మయమైన సత్తుపల్లి

ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు, పార్థసారథి రెడ్డిలు సత్తుపల్లిలో వెంకటవీరయ్య నామినేషన్ దాఖలుకు హాజరవ్వగా తన బలం చాటుకుంటూ సండ్ర నామినేషన్ కు ర్యాలీ తరలివచ్చార. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో తన సహచర సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డిలతో కలిసి సత్తుపల్లిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు.అంతకు ముందు ప్రముఖ దేవాలయం నీలాద్రి శివాలయంలో స్వయంభు శివలింగానికి నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అనంతరం బిఆర్ఎస్ పార్టీ సండ్ర వెంకట వీరయ్యకు అత్యంత ప్రాముఖ్యమైన సెంటిమెంట్ కలిగిన దేవాలయం సత్తుపల్లి పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. పాదయాత్రగా ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ ఆఫీసర్ అశోక్ చక్రవర్తికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ మహేష్, ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమా మహేశ్వర రావులు వెంట ఉన్నారు. పాదయాత్రలో నియోజకవర్గంలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రముఖులు, కార్యకర్తలు అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News