Friday, September 20, 2024
HomeతెలంగాణSathyavathi Rathod: అనాథల బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయం

Sathyavathi Rathod: అనాథల బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర పిల్లలుగా అనాథలు

అనాధల బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విశాఖపట్నంలోని భీమునిపట్నం వద్ద గల ఎస్ఓఎస్ విలేజ్ ను, సీఎంవో ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హొలీ కేరి, హానుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్నేహ శబరీష్‌ జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ ఇతర అధికారులతో కలసి మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అనాధలను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వారిని అనాధలుగా కాకుండా రాష్ట్ర పిల్లలుగా భావిస్తామని చెప్పారు. వారి బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

సీఎం కేసీఆర్‌ వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. వారు భవిష్యత్ లో స్థిర పడే విధంగా, వారు ఓ కుటుంబాన్ని ఏర్పరచుకునే వరకు వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి భవిష్యత్‌ అంధకారంగా మారకుండా విద్యా, ఉద్యోగం, ఉపాధి, కుటుంబం ఇలా వారు ఏర్పటు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. విశాఖ పట్నంలోని ఎస్వీఎస్ చిల్డ్రన్స్ విలేజ్ లో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సమస్యలను తెలుసుకునేందుకు సబ్‌కమిటీ సభ్యులు సమావేశమ‌య్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News