Monday, July 8, 2024
Homeతెలంగాణజగదీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం

జగదీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం

పార్టీ తరపున కోటి 50 లక్షల రూపాయలు

ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తూ మృతి చెందిన కుసుమ జగదీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా పార్టీ ఆదుకుంటుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంత్రి ఎమ్మెల్సీ పల్లె రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్ కో చైర్మన్ ఏరువా సతీష్ రెడ్డిలతో కలిసి చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బి ఆర్ఎస్ పార్టీ నుండి కోటి 50 లక్షల రూపాయలు అందచేయాలని ఆదేశంతో ఆ చెక్కును అందజేయడం జరిగిందని అన్నారు. రానున్న రోజులలో పార్టీ జగదీష్ కుటుంబానికి అండగా ఉంటుందనిస్పష్టం చేశారు. భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకటరావు, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News