Friday, September 20, 2024
HomeతెలంగాణSerilingampalli Congress: కుల గణన సర్వేపై శేరిలింగంపల్లి కాంగ్రెస్ హర్షం

Serilingampalli Congress: కుల గణన సర్వేపై శేరిలింగంపల్లి కాంగ్రెస్ హర్షం

మాట ఇచ్చాం చేసి చూపిస్తామన్నదే కాంగ్రెస్ పాలసీ

రాష్ట్ర శాసనసభ కుల గణన సర్వేకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ హర్షం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ నల్లగండ్ల లోగల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శేరీలింగంపల్లి బీసీ ఐక్యవేదిక సభ్యులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో పాటు, మంత్రివర్గాన్ని ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వాలిదాసు వాలిదాసు జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మాట ఇచ్చాం చేసి చూపిస్తాం అన్ని వర్గాల అభివృద్ధి ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన సర్వే ద్వారా బడుగు బలహీన వర్గాలకు మేమెంతో మాకంత అన్న విధంగా తెలంగాణ శాసనసభ కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకమని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే బడుగు బలహీన వర్గాలు సామాజిక రాజకీయ ఉద్యోగాల్లో ఎదగాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అని జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరేందర్ గౌడ్, భేరీ రామచందర్ యాదవ్, ఆర్కే సాయన్న ముదిరాజ్, రమేష్ యాదవ్, నర్సింగ్ ముదిరాజ్, నర్సింగ్ ముదిరాజ్, మక్బూల్, నవాజ్, నవాజ్, తిరుపతి, సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News