Friday, September 20, 2024
HomeతెలంగాణSerilingampally: నామినేషన్ దాఖలు చేసిన జగదీశ్వర్ గౌడ్

Serilingampally: నామినేషన్ దాఖలు చేసిన జగదీశ్వర్ గౌడ్

మంచి ఆదరణ లభిస్తోంది

కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం అభ్యర్థి వి. జగదీశ్వర్ గౌడ్ తమ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. హైదర్ నగర్ లోని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ఎత్తున ఊరేగింపుతో శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. హైదర్ నగర్ లో ప్రారంభమైన భారీ ఊరేగింపు మియాపూర్, ఆల్విన్ చౌరస్తా, గంగారం, చందానగర్, లింగంపల్లి మీదుగా సాగి ఆలిండ్, గుల్మోహర్ పార్క్ కాలనీ మీదుగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి చేరుకుంది. వి. జగదీశ్వర్ గౌడ్ ఊరేగింపులో అడుగడుగున ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది.

- Advertisement -

దారి పొడవున కార్యకర్తలు భారీ ఎత్తున బైక్లు కార్ల ర్యాలీని నిర్వహించారు. మధ్య మధ్యలో సాంస్కృతిక కళాకారులు విన్యాసాలు మేళా తాళాలతో జగదీశ్వర్ గౌడ్ కి స్వాగతం పలికారు. ఆదర్శనగర్ కాలనీ సమీపంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున గజమాలను తొడిగించారు. అట్టహాసంతో సాగిన ఊరేగింపు శాంతియుతంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం జగదీశ్వర్ గౌడ్ తన ముఖ్య అనుచరులతో కలిసి ఎన్నికల అధికారి బి శ్రీనివాస్ రెడ్డికి తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.

అనంతరం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తన విజయం కోసం ప్రజలు సంపూర్ణంగా ముందుకు వచ్చి తమ మద్దతును ప్రకటిస్తున్నారని తెలిపారు. తన పర్యటనల పట్ల ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ముక్తసరిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల పట్ల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆమోదయోగ్యమైన ఏజెండాలు ఉన్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News