Thursday, September 19, 2024
HomeతెలంగాణSerlingampalli: ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

Serlingampalli: ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తదితర డివిజన్ల కార్పొరేటర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పురప్రముఖులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ జిహెచ్ఎంసి రాగం నాగేందర్ యాదవ్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం కార్పొరేటర్ వార్డ్ కార్యాలయ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తరువాత తెలంగాణ అమరవీరులకు- తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గృహకల్ప, మరియు డివిజన్ లోని వివిధ కాలనీలలో జాతీయ జెండాను ఎగురవేశారు.

- Advertisement -

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్ శ్రీకళ, కటిక రాంచందర్, గోపినగర్ కమిటీ ప్రెసిడెంట్ గోపాల్ యాదవ్, కోదండరాం, బసవయ్య, యోగి, సుధాకర్, నాగేశ్వర్ రావు, రెడ్డి, శ్రీనివాస్, రవీంద్ర రాథోడ్, గణపురం రవీందర్, నయీమ్, కుటుంబరావు, విక్రమ్, వెంకట్ రెడ్డి, జనార్దన్, నాగరాజు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సైదులు యాదవ్, లవ కుమార్, రాజు, మునియా నాయక్, సారయ్య, తిరుపతి రావు, మహేందర్, వెంకటరెడ్డి, ప్రవీణ్, మూర్తి, నరసింహ, సంతోష్ అజీమ్ సుభాష్ రాథోడ్, లింగారెడ్డి, రహీం, మహిళా నాయకురాలు చంద్రకళ, భాగ్యలక్ష్మి, ముంతాజ్ బేగం, జయ, అరుణ, కుమారి, నిరూప, దివ్య, కమళ, రోజా, జయమ్మ, జయలక్ష్మి, కళ్యాణి, రజిని, వి.కుమారి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News