Sunday, October 6, 2024
HomeతెలంగాణSingareni: సింగ‌రేణి ఉద్యోగుల‌కు ఎరియ‌ర్స్ 1,450 కోట్లు

Singareni: సింగ‌రేణి ఉద్యోగుల‌కు ఎరియ‌ర్స్ 1,450 కోట్లు

11వ వేజ్ బోర్డు ఎరియర్స్

సింగ‌రేణి ఉద్యోగుల‌కు 11వ వేజ్ బోర్డు ఎరియ‌ర్స్ 1,450 కోట్లు విడుద‌ల చేశారు డైరెక్ట‌ర్‌ ప‌ర్స‌న‌ల్‌, ఫైనాన్స్‌ ఎన్‌.బ‌ల‌రామ్‌. ఛైర్మ‌న్ ఆదేశంపై కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో ఈరోజు గురువారం మ‌ధ్యాహ్నం జ‌మ చేసింది యాజ‌మాన్యం. త్వ‌ర‌లో ద‌స‌రా, దీపావ‌ళి బోన‌స్‌ల చెల్లింపున‌కు సింగ‌రేణి సంసిద్ధంగా ఉందని డైరెక్ట‌ర్ ప‌ర్స‌న‌ల్‌, ఫైనాన్స్‌ ఎన్‌.బ‌ల‌రామ్‌ వెల్లడించారు. ప్ర‌స్తుత 39,413 మంది ఉద్యోగుల‌కు 1,450 కోట్లు వారి ఖాతాల్లో జ‌మ చేసిన సింగ‌రేణి స‌గ‌టున ఒక్కో కార్మికుడికి మూడు ల‌క్ష‌ల డెబ్బై వేల రూపాయల‌ ఎరియ‌ర్స్‌ సింగ‌రేణి భ‌వ‌న్ నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఆన్‌లైన్ ద్వారా ఎరియ‌ర్స్ రూపంలో విడుద‌ల చేసింది. డైరెక్ట‌ర్ ప‌ర్స‌న‌ల్‌, ఫైనాన్స్‌ ఎన్‌.బ‌ల‌రామ్‌, జీఎం కో-ఆర్డినేష‌న్‌ ఎం.సురేష్‌
ఎరియ‌ర్స్ చెల్లింపుపై సింగ‌రేణి సీ&ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్, డైరెక్ట‌ర్ ఎన్‌.బ‌ల‌రామ్‌ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ఉద్యోగులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News