రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని సింగరేణి కార్మిక్షేత్రమైన ఆర్జీ-1 ఒసిపి-3 సీ.ఎస్.పి మరియు ఆర్జీ-2 ఎరియా వర్కషాప్ లలో కందుల సంధ్యారాణి రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్మికులని కలిసి రాఖీలు కట్టారు. అనంతరం మాట్లాడుతూ నిజజీవితంలో అన్నదమ్ములు లేని నాకు సింగరేణి కార్మికులనే అన్నదమ్ముల్లుగా భావించుకుంటూ ప్రతీ సంవత్సరం సింగరేణి కార్మికుల మధ్యనే రాఖీ వేడుకలు జరుపుకుంటున్నా అని అన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/4729cc41-83e5-4242-8970-214c8e9c16d4-1024x576.jpg)
కార్మికుల సహకారంతోనే రాజకీయ రంగంలో ముందుకు సాగుతున్నాం అన్నారు. మీ ఆశీర్వాదం, తోడ్పాటు ఎల్లవేళలా ఈ ఆడబిడ్డకి అందించాలని కార్మికులని కోరారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో నీతీ, నిజాయితీగా ఈ ప్రాంత అభివృద్ది,సంక్షేమం కోసం కృషి చేసాం అన్నారు. ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా ముందుండి వారికి అండగా నిలబడ్డామన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు గర్వపడే విధంగా మా పరిపాలన కొనసాగించామన్నారు. భవిష్యత్తులో సింగరేణి కార్మికులకి అండగా ఉంటూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/b3f64bc0-6242-4837-a459-3155842e0ecb-1024x576.jpg)
ఈ కార్యక్రమంలో సంపూర్ణ, రజిత, మంగ, రాజేశ్, విజయ్, పెద్ది సమ్మయ్య, శ్రీనివాస్, రాజబాబు, రామ్ చందర్, సత్యనారాయణ, మల్లయ్య, చంద్రయ్య కార్మికులు పాల్గోన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/caec50b7-1919-47f8-bb1c-19aeb040d886-1024x576.jpg)