Saturday, October 5, 2024
HomeతెలంగాణSingireddy Niranjan Reddy: కేసీఆర్ పాలనలో ప్రతి గడపకూ సంక్షేమం

Singireddy Niranjan Reddy: కేసీఆర్ పాలనలో ప్రతి గడపకూ సంక్షేమం

సీఎం సహాయనిధి లబ్దిదారులతో భోజనం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పాలనలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 187 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్దిదారులకు రూ.51.90 లక్షల విలువైన చెక్కులను అందజేసి వారితో సహపంక్తి భోజనం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాలకు ప్రభుత్వ అండగా ఉందని, వృద్దులు, దివ్యాంగులు, వితంతు, ఒంటరి మహిళలు, రైతులు, గర్భిణులు, బాలింతలు, శిశువులు, విద్యార్థులు, కిశోర బాలికలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ చేయూత అందిస్తుందని అన్నారు.అభివృద్ధి చేయని ఊరు లేదు .. సాయం అందని ఇళ్లు లేదన్నారు.దశలవారీగా డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం .. అర్హులందరకీ న్యాయం చేస్తాం అని అన్నారు. సొంత స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం అమలు చేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News