Tuesday, February 4, 2025
HomeతెలంగాణSnacks Menu: పది విద్యార్థులకు స్నాక్స్ మెనూ రెడీ

Snacks Menu: పది విద్యార్థులకు స్నాక్స్ మెనూ రెడీ

తెలంగాణలో 10వ తరగతి(Tenth Students) పరీక్షలకు సిద్దమవుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పబ్లిక్ పరీక్షలు జరగనుండగా… ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్‌లో స్నాక్స్(Snacks) ఇవ్వనున్నారు.

- Advertisement -

తాజాగా ఇందుకు సంబంధించిన మోనూను అధికారులు రెడీ చేశారు. తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లు, పల్లి చిక్కీ, ఉడకబెట్టిన బొబ్బర్లు (పెద్ద శనగలు), ఉల్లిపాయ పకోడీలు, ఉడకబెట్టిన పెసర్లు, శనగలు-ఉల్లిపాయ వంటి వంటకాలను రోజుకొకటి చొప్పున విద్యార్థులకు అందించాలని నిర్ణయించారు. ఈ స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనుండగా.. స్కూల్ యాజామాన్యం కమిటీ ఖాతాలకు ఈ నిధులు బదిలీ చేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News