Friday, September 20, 2024
HomeతెలంగాణSouth Korea: స్టడీ టూర్లో మంత్రులు

South Korea: స్టడీ టూర్లో మంత్రులు

మ్యూజికల్ ఫౌంటెన్ షోలో మంత్రులు

దక్షిణ కొరియా లోనీ Yeosu పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మ్యూజికల్ ఫౌంటెన్ Big O Show ను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ లు. రాష్ట్ర మంత్రులు డా. V. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా Yeosu పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మ్యూజికల్ ఫౌంటెన్ Big O Show ను పరిశీలించారు.

- Advertisement -

సౌత్ కొరియా లోని Yeosu పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన Big O Show మ్యూజికల్ ఫౌంటెన్ కంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడిన మెరుగైన ఫౌంటెన్ ను కరీంనగర్ లోని మానేరు రివర్ ఫ్రంట్ లో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రులు బృందం వెల్లడించారు. Big O Show మ్యూజికల్ ఫౌంటెన్ ను పనితీరు అడిగి తెలుసుకున్నారు. మ్యూజికల్ ఫౌంటెన్ షో ను మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గార్ల తో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం తో కలిసి తిలకించారు.

రాష్ట్రంలో మహబూబ్ నగర్ తో పాటు వివిధ పట్టణాలలో ఆధునిక మ్యూజికల్ ఫౌంటైన్లను ఇన్ స్టాల్ చేయడానికి పరిశీలిస్తున్నామన్నారు. దక్షిణ కొరియాలోని పర్యాటక ప్రదేశాల పనితీరు అక్కడి సాంకేతికతను అందిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామన్నారు. అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో పర్యాటశాఖ ఆధ్వర్యంలో వివిధ పట్టణాల్లో ఉన్నటువంటి పర్యాట ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు రాష్ట్రానికి విదేశీ పర్యాటకులు ఆకర్షించే లక్ష్యంగా రాష్ట్రంలో ఆధునిక పరిజ్ఞానంతో పనిచేసే మ్యూజికల్ ఫౌంటెన్ లు, జెయింట్ వీల్స్, వాటర్ స్పోర్ట్స్ లను కరీంనగర్ లోనీ మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి కి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, మహబుబ్ నగర్ లోని ట్యాంక్ బండ్ అభివృద్ధి, అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్ జెయింట్ వీల్ వేవ్ పూల్, వాటర్ రైడ్స్,వాటర్ స్పోర్ట్స్ రాష్ట్రంలో మన్యంకొండ వద్ద మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న రోప్ వే, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో పర్యాటకులకు కనువిందు చేసే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త కొత్త పర్యాటక ఆకర్షణలను తీర్చిదిద్దుతున్నామనీ మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా Yeosu పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మ్యూజికల్ ఫౌంటెన్ Big O Show ను మంత్రులు డా. V. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పర్యాటక శాఖ ఎండి మనోహర్ లు పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News