Tuesday, September 17, 2024
HomeతెలంగాణSP Sarath: బాధితులకు భరోసా పోలీస్

SP Sarath: బాధితులకు భరోసా పోలీస్

న్యాయం కోసం పోలీసుల వద్దకు వచ్చే బాధితులకు భరోసాగా తెలంగాణ పోలీస్ ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా ఎస్పి వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సంభందిత అధికారులకు సూచించారు. ప్రతి రోజు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఉదయం 11:00గం నుండి 02:00గం వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని ఎస్పీ తెలిపారు.
ప్రజల రక్షణ కోసమే అనునిత్యం పోలీసులు పనిచేస్తున్నారని, సమస్యలు పరిష్కరించడంలో పోలీసులు ముందుండి, ప్రజలకు న్యాయం జరిగేలా చూడటమే పోలీసుల కర్తవ్యం అని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ అన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా ప్రతి పోలీసు అధికారి పనిచేయాలని, బాధితుల ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఎస్పి ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News