Friday, September 20, 2024
HomeతెలంగాణSrinivas Goud: ఆర్య వైశ్యులు సేవకు మారుపేరు

Srinivas Goud: ఆర్య వైశ్యులు సేవకు మారుపేరు

మీరు చేసే సేవాకార్యక్రమాలకు అండగా ఉంటాం

ఆర్య వైశ్యులు సేవకు మారుపేరని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశవ్యాప్తంగా నిత్యాన్నదాన సత్రాలు, ఆరోగ్య శిబిరాలు, పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తూ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడిలో ఉన్న వాసవీ కళ్యాణ మండపంలో ఆర్య వైశ్య సంఘం, యశోదా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను మంత్రి ప్రారంభించారు.

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాటికి మహబూబ్ నగర్ లో వివిధ రకాల వ్యాపారాలు చేసుకునే వారి పట్ల దౌర్జన్యాలు ఉండేవని… తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్భయంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి తీసుకు వచ్చామని మంత్రి తెలిపారు. ఒకప్పుడు రైస్ మిల్లులు, వివిధ పరిశ్రమలు నిర్వహించేవారు కనీసం ఈ అమ్మాయిలు కట్టే పరిస్థితి కూడా ఉండేది కాదని… స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి కష్టాలు తీరాయన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగే అన్ని సేవా కార్యక్రమాలకు అండగా ఉంటామని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, ఆర్యవైశ్య నాయకులు ప్రమోద్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News