Friday, September 20, 2024
HomeతెలంగాణSrinivas Goud: అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరిక

Srinivas Goud: అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరిక

బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయి బ్రాహ్మణులు

రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ, మహబూబ్ నగర్ లో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు హన్వాడ నాయి బ్రాహ్మణ సంఘం నేతలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో హన్వాడ మండల నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు సత్యనారాయణ, ఆంజనేయులు, రాఘవేంద్ర, శ్రీశైలం, అనిల్, రమేష్ సహా 50 మంది హన్వాడ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్గౌడ్ ముఖ్య నాయకుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు.

- Advertisement -


ఒకప్పుడు మహబూబ్ నగర్ లో కనీసం తాగునీరు కూడా దొరికే పరిస్థితి ఉండేది కాదని… ఇప్పుడు నిత్యం మిషన్ భగీరథ మంచినీరు పుష్కలంగా అందుతున్నాయని నాయి బ్రాహ్మణ సంఘం నేత సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్ అందిస్తూ తమకు అండగా నిలుస్తున్నారని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల మహబూబ్ నగర్ రూపు రేఖలు మారిపోయాయని అందుకే అభివృద్ధికి ఆకర్షితులమై అధికార పార్టీలో చేరినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News