Monday, July 8, 2024
HomeతెలంగాణSrinivas Goud: కాళేశ్వరంలా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి

Srinivas Goud: కాళేశ్వరంలా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి

తెలంగాణ రాష్ట్రం రాకపూర్వం తెలంగాణలో సాగునీటి సంగతి దేవుడు ఎరుగు తాగడానికి సైతం నీరు లేకుండేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించిన ” సాగునీటి దినోత్సవానికి” ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అతి కొద్ది సమయంలోనే చిన్న రాష్ట్రం అయినప్పటికీ దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ,భారతదేశంలో యాసంగిలో మొత్తం దేశవ్యాప్తంగా 96 లక్షల ఎకరాలలో వరి పంట సాగైతే, అందులో 56 లక్షలు కేవలం తెలంగాణ నుండి స్టార్ట్ అయిందని తెలిపారు .దీనినిబట్టి మన పంటలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆలోచించాలని తెలిపారు. గతంలో ఇరిగేషన్ శాఖకు ఎలాంటి గుర్తింపు ఉండేది కాదని ఇప్పుడు అందరికన్నా అత్యంత అద్భుతంగా ఇరిగేషన్ శాఖ పనిచేస్తున్నదని, మంత్రి తెలిపారు. 2014 కు పూర్వం మే, జూన్ మాసంలో ఎండిపోయిన కంకులతో రైతులు కన్నీటితో కాలం వెళ్లబుచ్చేవారని, అలాంటిది ఎండాకాలంలో సైతం ఇప్పుడు చెరువులు,కాలువలు నీళ్లు ఉన్నాయని తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందని, కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లు పూర్తయితే మహబూబ్ నగర్ జిల్లా సశ్యశ్యామలమవుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం నాగర్ కర్నూల్ పర్యటనలో పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి త్వరలోనే సాగునీరు అందిస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లు పూర్తయితే త్వరలోనే కాల్వల నిర్మాణానికి పిలిచి పనులను పూర్తి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాలో నిర్మించిన చెక్ డ్యాముల వల్ల భూగర్భ జలాలు పెరిగాయని ,కోయిల్ సాగర్ ను గ్రావిటీ ద్వారా నింపనున్నామని , అదేవిధంగా జూరాల ప్రాజెక్టును తిరుగు జలాల ద్వారా నింపే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. అలాగే పాలమూరు- రంగారెడ్డి ద్వారా అన్ని చెరువులను నింపి వ్యవసాయానికి సాగునీటితో పాటు ,చేప పిల్లల పెంపకాన్ని చేపడతామని అన్నారు .తెలంగాణ ఇంజనీర్లు కష్టపడి పనిచేసి రికార్డ్ టైంలో కాలేశ్వరాన్ని పూర్తి చేసినట్లే వచ్చే సంవత్సరం నాటికి పాలమూరు- రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేయాలని అన్నారు. కోర్టు కేసుల వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో చేపట్టనున్నచెక్ డ్యాముల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవాలని ఇంజనీరింగ్ అధికారులని ఆదేశించడమే కాక వచ్చే సంవత్సరం నాటికి పనులు పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, బోటింగ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

- Advertisement -


మహబూబ్నగర్ పట్టణంలోని పెద్ద చెరువును రాష్ట్రంలోనే మొదటి మినీ ట్యాంక్ బండ్ గా ఏర్పాటు చేశామని, ఒకప్పుడు దుర్గంధభరితంగా ఉన్న మినీ ట్యాంక్ బండ్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని పరిశీలించాలని ,ముఖ్యంగా మినీ ట్యాంక్ బండ్ రివిట్మెంట్ పనులపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు సైతం అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మన ఊరు- మన భవిష్యత్తుగా భావించి ఉద్యోగులు పనిచేయాలని ఆయన అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కే .సీతారామారావు ,జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రైతుబంధు కో-ఆర్డినేటర్ గోపాల్ యాదవ్, ఎస్ ఈ చక్రధరం, ఈఈలు దయానంద్, వెంకటయ్య, పిఎసిఎస్ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, డి ఈ మనోహర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన సాగునీటి శాఖ ఇంజనీర్లను మంత్రి జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు మంత్రిని సన్మానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News