Saturday, October 5, 2024
HomeతెలంగాణGodavarikhani: శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలు

Godavarikhani: శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలు

ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీపాదరావు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దివంగత కాంగ్రెస్ నాయకులు దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోదావరిఖనిలో బస్ స్టేషన్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, నగర మేయర్ అనిల్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం తో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకులు శ్రీపాద రావు అని నాయకులు కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News