Thursday, September 19, 2024
HomeతెలంగాణSunke Ravi: మరోసారి కారుకూతలు కూస్తే ఖబర్దార్

Sunke Ravi: మరోసారి కారుకూతలు కూస్తే ఖబర్దార్

ఉచిత విద్యుత్‌ ఇస్తే కాంగ్రెస్ కు ఎందుకు ఏడుపు ?

రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చే ప్రభుత్వం కావాలా మూడు గంటల కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ కావాలా రైతులు సమాలోచన చేయాలని ఎమ్మెల్యే అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావు పేట గ్రామం గల రైతువేదికలో నిర్వహించిన రైతుసమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ మరోసారి బయటపెట్టిందని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు.
కర్షకులకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ ప్రకటించిన కాంగ్రెస్‌ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని దుయ్యబట్టారు. గతంలోనూ రైతులకు విద్యుత్‌ ఇవ్వకుండా గోస పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్‌ ఆలోచనల్ని తెలంగాణ రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారని అన్నారు. రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ అని,దేశంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది హస్తం పార్టీ అని మండిపడ్డారు.
గతంలో రైతుల పట్ల కాంగ్రెస్‌ పార్టీ కక్షపూర్తిత పాలన చేసిందన్నారు. గతంలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ హామీని ఆ పార్టీ విస్మరించిందని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్‌ హయాంలో 9 గంటల విద్యుత్‌ ఇవ్వట్లేదని రైతులు ధర్నాలు చేశారని అన్నారు. ‘రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తే కాంగ్రెస్ కు ఎందుకు ఏడుపు అని, ప్రజలకు ఏదీ ఉచితంగా ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదని కాంగ్రెస్‌ నేతలు రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. సాగుకు 3 గంటల ఉచిత విద్యుత్‌ చాలని నేతలకు ఇంట్లో 24 గంటల విద్యుత్‌ ఉండాలి, రైతులకు మాత్రం 24 గంటల విద్యుత్‌ ఉండవద్దా? కాంగ్రెస్‌ పార్టీ రైతుల పట్ల దుర్మార్గపు ఆలోచనలు చేస్తోందన్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా రైతులతో కలిసి తీర్మానాలు చేశామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు సైతం వద్దంటారని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -


ఇప్పటికే ధరణి ఎత్తివేస్తామన్న రేవంత్ ప్రకటనతో రైతులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు.
అజ్ఞానంతో రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందన్నారని ఆక్షేపించిన రేవంత్ రెడ్డి, 24 గంటల ఉచిత విద్యుత్​తో దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదిగారని వివరించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News