Friday, September 20, 2024
HomeతెలంగాణSunke Ravisankar: బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

Sunke Ravisankar: బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిరుమలాపూర్ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన సండ్రల్లపల్లి గ్రామానికి చెందిన పెంకాసుల అక్షయ్,పిట్టల రాజేందర్ లు గత ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మృతులను చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ వారి ఇంటికి వెళ్లి మృతుల కుటుంబీకులను పరామర్శించి, మృతికి గల కారణాలు తెలుసుకొని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పునుగొటి కృష్ణారావు, కొడిమ్యాల సింగల్ చైర్మన్ మేనేని రాజనర్సింగరావు, ఏఎంసి చైర్మన్ కోరండ్ల‌ నరేందర్ రెడ్డి,వైస్‌ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, కో ఆప్షన్ నసీరుద్దీన్,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీ బసనవేణి మహేష్, నాయకులు మల్యాల మహిపాల్,తైదల లక్ష్మణ్, నేరెళ్ల మహేష్, మొగిలిపాలెం రమేష్,కొత్తూరి స్వామి,పర్లపల్లి ప్రభుదాస్, మహంకాళి గంగ రాజం,ల్యాగల‌ రాజేశం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News