Thursday, September 19, 2024
HomeతెలంగాణSuryapeta: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జగదీష్ రెడ్డి

Suryapeta: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి వేడుకలు ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, పరేడ్ గ్రౌండ్ లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. శాంతి కపోతాలను ఎగుర వేసిన మంత్రి జగదీష్ రెడ్డి, సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన త్రివర్ణ బెలూన్ లను గాలిలోకి వదిలారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జడ్ పి చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకట్రావు, ఎస్ పి రాజేంద్రప్రసాద్, ఆడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News