Friday, September 20, 2024
HomeతెలంగాణSuryapeta: సీతారాముల విగ్రహ ప్రతిష్టలో శానంపూడి

Suryapeta: సీతారాముల విగ్రహ ప్రతిష్టలో శానంపూడి

నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ ఆవాస గ్రామమైన లాల్ లక్ష్మీపురంలో హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి కోదండ రామస్వామి సీతా లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు, అనంతరం పూజారుల ఆశీర్వాదం తీసుకొన్నారు. ప్రజలపై ఉన్న ప్రేమతో భగవంతునిపై ఉన్న భక్తితో అక్కడ సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు భక్తి భావంతో ఉండాలని,సీతారాములు ప్రజలను చల్లగా చూస్తారని అన్నారు,ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాపోలు నరసయ్య,విగ్రహ దాత పిఎసిఎస్ చైర్మన్ అనంతల శ్రీనివాస్ గౌడ్,ఎంపిపి లకుమల్ల జ్యోతి బిక్ష,మండల పార్టీ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాదెండ్ల శ్రీధర్,వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోమగాన్ని మురళి, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లబోయిన లింగయ్య,సర్పంచ్ పల్లెపంగు నాగరాజు,ఎంపీటీసీ నాగవేణి గురువయ్య,గ్రామ ప్రజలు మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News