Saturday, April 12, 2025
HomeతెలంగాణErrabelli: కల్లు బాగుందన్న మంత్రి

Errabelli: కల్లు బాగుందన్న మంత్రి

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం పెద్ద మడూరు గ్రామంలో శ్రీ కంత మహేశ్వర దేవాలయంలో పూజలు చేసి, ఆలయాన్ని ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి ని పురస్కరించుకొని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎర్రబెల్లి. ఆ తర్వాత, పెద్ద మడూరు, నల్ల కుంట తండా గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో, మహిళలతో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా గౌడ సోదరుల కోరిక మేరకు కల్లు రుచి చూశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంత్రి మీద అభిమానంతో గౌడ సోదరులు పోటీ పడి కల్లు పోశారు. పట్టు పట్టి, మంత్రి గారిని ఒక పట్టు పట్టాలని అభ్యర్థించడం తో మంత్రి కాదనలేని స్థితిలో ఆ కల్లు తాగి వారిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.  కల్లు రుచి బాగుందని చెప్పి అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల ప్రముఖులు, విగ్రహ ప్రతిష్ఠాపన సంఘం బాధ్యులు, గ్రామ ప్రముఖులు, ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన గౌడ సోదరులు, పెద్ద మడూరు గ్రామం, నల్ల కుంట తండా ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News