Saturday, October 5, 2024
HomeతెలంగాణTandur: బీజేపీకి భయపడే ఇద్దరు నాయకులు ఒకటయ్యారు

Tandur: బీజేపీకి భయపడే ఇద్దరు నాయకులు ఒకటయ్యారు

బీజేపీ తాండూరు అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్

మీ కలయికతో తాండూరుని ఉద్దరిచేది ఏమీ లేదు.. ఈ సారి తాండూరులో బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా బుద్ధి చెప్తామని తాండూర్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు పట్టణంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి మంత్రి పదవి వచ్చిన తర్వాత తాండూర్ కి విచ్చేసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యాలను రజనీకాంత్ ఖండించారు. బీజేపీ పార్టీకి భయపడి ఇద్దరు నాయకులు ఒకటయ్యారని అన్నారు. నమ్ముకొని ఉన్న కార్యకర్తలను నిండా ముంచి, ఇప్పుడు చప్పట్లు కొట్టినంత మాత్రాన, గెలుపొందాలేరని  పేర్కొన్నారు. రానున్న రోజుల్లో  తాండూరు ప్రజలే మీకు గుణపాఠం చెబుతారని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలిసినంత మాత్రాన ప్రజలందరూ, మీకు సహకరిస్తారని అనుకోవడం  సిగ్గుచేటని అన్నారు. తాండూరు ప్రాంత ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారని, బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేందుకే బిజెపితో ప్రజలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ తాండూరులో ఘనవిజయం సాధిస్తుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News