Friday, September 20, 2024
HomeతెలంగాణTandur: మనసున్న మహారాజు ఎమ్మెల్యే పైలెట్

Tandur: మనసున్న మహారాజు ఎమ్మెల్యే పైలెట్

10 వేల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతిఏటా ఉచిత బస్ పాస్ లు, ఇందుకు 5 లక్షల చెల్లించిన పైలట్

గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు చేయూత అందించి మనసున్న మహారాజు అనిపించుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేందుకు ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బస్ పాస్ లను జారీ చేసేందుకు ఆర్టీసీ ప్రతి విద్యార్థి నుంచి రూ.50 సర్వీసు ఛార్జీ రూపంలో వసూలు చేస్తోంది. ఈ మొత్తంను విద్యార్థుల తరపున ఆర్టీసీకి చెల్లించేందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముందుకొచ్చారు. తాండూరు బస్ డిపో పరిధిలో మొత్తం 10 వేల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతిఏటా ఉచిత బస్ పాస్ లను తీసుకుంటున్నారు. వీరు చెల్లించాల్సిన రూ.5 లక్షల డబ్బును చెల్లించేందుకు ఎమ్మెల్యే ముందుకు రావడంతో పాటు ఈ మొత్తంను తాండూరు డిపో మేనేజర్ సమతకు అందించారు. ఉచిత బస్ పాస్ లు తీసుకునే విద్యార్థుల నుంచి ఎలాంటి సర్వీసు ఛార్జీలను వసూలు చేయవద్దు అని ఆర్టీసీ డిపో మేనేజర్ కు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సూచించారు. ఒకేసారి 10 వేల మంది గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు ఉచిత బస్ పాస్ లు పొందడానికి చెల్లించాల్సిన సర్వీసు ఛార్జీని చెల్లించడంతో పాటు బస్ పాస్ లను భద్రంగా ఉంచుకునేందుకు ప్రతి విద్యార్థికి ఒక పర్సును కూడా అందజేయాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్ణయించారు. ఉచిత బస్ పాస్ లు తీసుకునే గ్రామీణ విద్యార్థుల తరపున సర్వీసు ఛార్జీలను చెల్లించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తాండూరు డిపో మేనేజర్ సమత కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఉచిత బస్ పాస్ లను గ్రామీణ విద్యార్థులకు జారీ చేస్తామని ఆమె వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News