Monday, July 8, 2024
HomeతెలంగాణTanduru: బిఆర్ఎస్ కి తిరుగులేదు

Tanduru: బిఆర్ఎస్ కి తిరుగులేదు

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే బీఆర్ఎస్‌లోకి భారీగా వాలుసపెట్టి చేరికలు జరుగుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే, వార్డు అభివృద్ధి కోసం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వరాల శ్రీనివాస్ రెడ్డిని రోహిత్ రెడ్డి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వరాల శ్రీనివాస్ మాట్లాడుతూ తాండూరు చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా అభివృద్ధి జరుగుతుందని. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యై పైలెట్ రోహిత్ రెడ్డి చేసే అభివృద్దికి ఆకర్షితులమై బీఆర్ఎస్ లోకి చేరడం జరిగిందన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి, పార్టీ అబివృద్దికి కృషి చేస్తానని పార్టీ సిద్ధాంతాలు విధివిధానాలను లోబడి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా తమ కార్యాచరణను కొనసాగిస్తానని అన్నారు. అనంతరం కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో 100 మంది యువకులు, మహిళలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు, పట్టణ అధ్యక్షులు నాయుమ్ అఫు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్, హరిహర గౌడ్, కౌన్సిలర్లు వెంకన్న గౌడ్ , సంగీత ఠాకూర్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News