Monday, July 8, 2024
HomeతెలంగాణTanduru: ఎమ్మెల్యే పైలెట్ హైలెట్

Tanduru: ఎమ్మెల్యే పైలెట్ హైలెట్

బీఆర్ఎస్ పార్టీ ఆత్మయ సమ్మేళనం తాండూరు ప్రభంజనాన్ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చాటిందని సంతోషం వ్యక్తం చేశారు. యాలాల మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లక్ష్మీనారాయణపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పుట్టినందుకు మనం అదృష్టవంతులం, దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా దూసుకెళ్తుందంటే ఆ గౌరవం ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని.. మన రాష్ట్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు పైలట్.

- Advertisement -

 ఓట్లు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్‌కే ఉందని.. ఎన్నికల్లో చెప్పినట్టు మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.. తాండూరు రూపురేఖలు మారుస్తానన్నారు.  మీరు మరొక్కసారి నన్ను ఆశీర్వదించండి, తాండూరును సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు.

ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా యాలాల మండలం నుంచి అన్ని గ్రామాల ప్రజలు భారీ ఎత్తున కదిలి వచ్చారు. తెలంగాణ సంప్రదాయాన్ని చాటుతూ.. బతుకమ్మలు, ఎండ్ల బండ్లు, బంజారా మహిళలు తమ వేషదారణతో వచ్చి ఆకట్టుకున్నారు. ఊహించని విధంగా జనసంద్రంలా ఆత్మీయ సమ్మేళనం ప్రాంగణమంతా గులాబీ మయమైంది. ఎమ్మెల్యే బంజారా మహిళతో కలిసి సాంప్రదాయ నృత్యం చేయడంతో ప్రాంగణమంతా ఒక్కసారిగా జై రోహిత్ అన్నా అంటూ దద్దరిల్లింది. ఆత్మీయ సమ్మేళనంలో సందర్బంగా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  మరోసారి తన మార్కు చూపించి హైలెట్ గా నిలిచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News