Saturday, May 3, 2025
Homeకెరీర్Dost Notification: ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల

Dost Notification: ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్(Dost Notification)విడుదలైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మొత్తం మూడు విడతల్లో కళాశాల్లో ప్రవేశాలను నిర్వహించనున్నారు. ఈమేరకు విద్యార్థులు దోస్త్‌ వెబ్‌సైట్, మొబైల్ యాప్, మీసేవ యాప్, మీసేవ కేంద్రాలకు వెళ్లి ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -

ఈ నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, JNTUH, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, తదితర సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News