Saturday, November 15, 2025
HomeతెలంగాణTeacher Promotions: తెలంగాణ టీచర్లకు తీపి కబురు.. ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్!

Teacher Promotions: తెలంగాణ టీచర్లకు తీపి కబురు.. ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్!

Promotions For Telangana Government Teachers: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ పదోన్నతుల షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ నిర్ణయంతో ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), స్కూల్ అసిస్టెంట్లకు ప్రయోజనం చేకూరనుంది. SGT లను స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లను హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఇది ఒకటి కావడంతో, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీని నెరవేర్చడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

పదోన్నతుల వల్ల ఏర్పడే ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. దీనివల్ల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. హెడ్ మాస్టర్ పోస్టులు భర్తీ కావడంతో పాఠశాలల పర్యవేక్షణ, నిర్వహణ కూడా మెరుగుపడుతుందని, ఇది రాష్ట్ర విద్యాభివృద్ధిలో కీలక అడుగుగా నిలుస్తుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad