ఈశాన్య రాష్ట్రాల వైపు తేమ వెళ్లిపోవడం వల్ల తెలంగాణలో వర్షాలు తగ్గముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Weather Report) తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం, కొంత ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సముద్రంలో ఏర్పడిన ఉపరిత చక్రవాత ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం, శనివారం కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్క కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక వచ్చే మూడు రోజుల పాటు అన్ని జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. .
హైదరాబాద్, ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, మెదక్, కొమురం భీమ్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. అలాగే భువనగిరి, సిద్ధిపే జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రైతులు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సాగు పనులు సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు, వైర్లుకు దూరంగా ఉండాలని.. చెట్ల కింద పనులు చేయవద్దని తెలిపారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
Weather Report: తెలంగాణలో వచ్చే మూడు రోజులు తేలికపాటి వర్షాలు
- Advertisement -