“ఇసుక వ్యాపారుల ఇష్టారాజ్యం” పేరిట బుధవారం తెలుగు ప్రభ పత్రికలో వెలువడిన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 9 ట్రాక్టర్లను పట్టుకొని తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా, నిర్దేశించిన సమయం కన్నా ముందు లేదా సమయం ముగిసిన తర్వాత అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/dc1e5724-f8f7-4ba9-bf8a-78495b2b9c38-1024x768.jpg)