Sunday, July 7, 2024
HomeతెలంగాణMedaram Jatara special Book: మేడారం జాతరపై తెలుగుప్రభ దినపత్రిక ప్రత్యేక సంచిక విడుదల...

Medaram Jatara special Book: మేడారం జాతరపై తెలుగుప్రభ దినపత్రిక ప్రత్యేక సంచిక విడుదల చేసిన మంత్రులు

జాతర ప్రాచుర్యం సమాజానికి తెలియజేయడం గొప్ప విషయం

మేడారం మహా జాతర సందర్భంగా జాతర ప్రాచుర్యం సమాజానికి తెలియజేయడం గొప్ప విషయం అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రిపొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి,స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ ( సీతక్క) అన్నారు. సోమవారం మేడారంలోని మీడియా సెంటర్లో సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సమాచార శాఖ ఆర్జెడి డి ఎస్ జగన్ తో కలిసి తెలుగు ప్రభ దినపత్రిక ముద్రించిన ప్రత్యేక సంచికను వారు ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక సంచికలో జాతర విశేషాలతో పాటు జాతరలో విధులు నిర్వహించే అధికారులు, ములుగు జిల్లా అధికారుల సెల్ నెంబర్లు పొందుపరచడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఈ ప్రత్యేక సంచిక ఎంతగానో ఉపయోగపడుతుందని, రానున్న జాతరలో ఇదే తరహాలో ప్రత్యేక సంచికలు వెలువరించాలని కోరారు.

కార్యక్రమంలో సమాచార శాఖ ఏడి లక్ష్మణ్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు పల్లవి, అయూబ్ ఖాన్, కిరణ్ మై, ఎం ఏ గౌస్, రాజేంద్రప్రసాద్, ఎండి రఫీక్, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో టి. శ్రీనివాస్ , ములుగు జిల్లా ఇన్చార్జి బ్యూరో చీఫ్ జి. శ్రీధర్, జిల్లాలోని తెలుగు ప్రభ పాత్రికేయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News