అసెంబ్లీ(TG Assembly) వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి ప్రవేశించేందుకు బీఆర్ఎస్వీ(BRSV)నాయకులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఓయూలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ వీసీ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గుడుస్తున్నా ఇప్పటి వరకు విద్యా శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని.. గురుకులాల్లో మరణించిన విద్యార్థులకు రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు.