Saturday, November 15, 2025
HomeTop StoriesTelangana: మున్సిపాలిటీలకు భారీ నిధులు.. రూ.2780 కోట్లు విడుదల చేసిన రేవంత్ సర్కార్!

Telangana: మున్సిపాలిటీలకు భారీ నిధులు.. రూ.2780 కోట్లు విడుదల చేసిన రేవంత్ సర్కార్!

Municipal Development Works: మున్సిపాలిటీల అభివృద్ధికి రేవంత్ రెడ్డి సర్కార్ భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో గల 138 మున్సిపాలిటీలకుగాను.. రూ.2780 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లోని వివిధ అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. అంతే కాకుండా ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల విస్తరణతో పాటు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలన్నింటిలో.. మెరుగైన సదుపాయాలను ఏర్పరచాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ప్రాధాన్యత క్రమంలో నిధుల ఖర్చు: మున్సిపల్ శాఖ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో 2,432 అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లో పొందుపరిచిన నగరాభివృద్ధి నిధులతో పాటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవెలప్మెంట్ ఫండ్ పథకాల నుంచి ఈ నిధులను ఈ మంజూరు చేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు కేటాయించారు. అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు రూ. 20 కోట్లు కేటాయించారు. పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు రిలీజ్ చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లకు రూ. 30 కోట్లు మంజూరు చేశారు. ప్రాధాన్యత క్రమంలో నిధులను ఖర్చు చేయాలని మున్సిపల్ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలను రూపొందించింది.

అభివృద్ధిలో భాగంగా చేపట్టే పనులు: రాష్ట్రంలో గల 138 మున్సిపాలిటీలకుగాను అభివృద్ధి చేసేందుకుగాను.. సీఎం రేవంత్ రెడ్డి రూ.2780 కోట్లు మంజూరు చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధి భాగంగా.. రహదారుల నిర్మాణం, వర్షపు నీరు, మురుగు నీటికి డ్రైన్ల నిర్మాణం, జంక్షన్‌ల అభివృద్ధి, చెరువులు, కుంటల్లో కాలుష్య నివారణ, పార్కుల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణాలను చేపట్టనున్నారు. 2026 మార్చి నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad