Thursday, September 19, 2024
HomeతెలంగాణThalasani: ఫిష్ మార్కెట్ భవనానికి శంకుస్థాపన

Thalasani: ఫిష్ మార్కెట్ భవనానికి శంకుస్థాపన

పట్నంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యే మంచిరెడ్డి పర్యటన

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడ సమీపంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఫిష్ మార్కెట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
సీతారాంపేట్ లో 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల పిఏసిఎస్ గొడౌన్ ను మంత్రి తలసాని, ఎమ్మెల్యే మంచిరెడ్డి కలిసి ప్రారంభించారు.

- Advertisement -

హరితహారంలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని జేబీ వెంచర్ లో మొక్కలను నాటారు. సాగర్ రోడ్డు నుండి ఉప్పరిగూడ గ్రామానికి గల రోడ్డును ఇరువురు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో చేపలు, రొయ్య పిల్లలను పంపిణీ చేశారు. తదనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించి, మత్స్యకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కృపేష్, రాష్ట్ర నాయకులు ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ), జర్కొని రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News