Sunday, October 6, 2024
HomeతెలంగాణThangallapalli: బొట్టు పెట్టి బీజేపీ ఇంటింటి ప్రచారం

Thangallapalli: బొట్టు పెట్టి బీజేపీ ఇంటింటి ప్రచారం

మహిళా నేతల సందడి

కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బూత్ నెంబర్ 185 లో బూత్ అధ్యక్షుడు ఇటికల రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కు మద్దతుగా బిజెపి మహిళా నాయకురాలు మహిళలకు బొట్టు పెట్టుకుంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ దేశం కోసం పాటుబడే ప్రతి ఒక్కరూ బిజెపి పార్టీ కే ఓటు వేయాలని ప్రజలను కోరారు. మోడీ బలపర్చిన అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ మరో సారి మీ ముందుకు వచ్చారని, వారిని కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News