Sunday, June 22, 2025
HomeతెలంగాణThangallapalli: కరపత్రం ఆవిష్కరించి ఇంటింటి ప్రచారం నిర్వహణ

Thangallapalli: కరపత్రం ఆవిష్కరించి ఇంటింటి ప్రచారం నిర్వహణ

బీఆర్ఎస్ ను గెలిపించుకుందాం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ పడిగెల మానస రాజు హాజరై మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి సీఎం కేసీఆర్ ను గెలిపించుకొని మళ్ళీ తెలంగాణకు మూడవ సారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు.

- Advertisement -

అలాగే మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్ష మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను గడపకు తిరుగుతూ ప్రచారం కొనసాగించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, సిరిసిల్ల ప్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి, ఏఎంసి డైరెక్టర్ సద్ద రోజ సురేష్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న, జాగృతి మండల అధ్యక్షుడు కందుకూరి రామ గౌడ్, మండల యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నేరెల్ల అనిల్ గౌడ్, వార్డు సభ్యులు రెడ్డి పర్షరాములు, క్యారం జగత్, సీనియర్ నాయకులు పడిగెల రాజు, తోకల రవి, బానుముర్తి, వెంగల రమేష్, బిక్షపతి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News