Sunday, November 16, 2025
HomeతెలంగాణThangallapalli: కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం

Thangallapalli: కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం

వెలిచాల గెలుపు కోసం శ్రమిస్తున్న శ్రేణులు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సిరిసిల్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క శేఖర్ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

- Advertisement -

ఈ సందర్భంగా చుక్క శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిగా.. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటే మన తరఫున పార్లమెంట్లో మన గొంతుగా వినిపిస్తాడని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, నాయకులు ఎండి సలీం, ఎండి హమీద్, నస్రిన్ బేగం, హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad