Sunday, October 6, 2024
HomeతెలంగాణThangallapalli: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

Thangallapalli: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

మండేపల్లి గ్రామ సర్కారీ బడి అభివృద్ధి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 2003-04 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు చదువుకున్న పాఠశాలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఉద్దేశంతో అందరూ ఒకచోట చేరి వారం రోజుల క్రితం పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రపరిచి, ఆవరణలో ఉన్న చెట్లకు రంగులద్దారు. పాఠశాలలో ఉన్న బోరు బుగర్భ జలాలు అడుగంటడంతో బోరు పనిచేయకపోవడంతో పాఠశాలకు 5 వేల రూపాయల మోటర్ కొనుగోలు చేసి వాటర్ అందేలా కృషి చేశారు.

- Advertisement -

పాఠశాల ఆవరణలోని రాధాకృష్ణ విగ్రహానికి రంగులద్ది విద్యార్థుల సౌకర్యార్థం కొరకు సుమారు 20 వేల రూపాయల ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు అందించారు. అనంతరం వారు చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మైమరిచిపోయి, ఆనంద కరమైన వాతావరణంలో కార్యక్రమాన్ని కొనసాగించారు. పూర్వ విద్యార్థులు చేసిన సేవ కార్యక్రమానికి గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News