Sunday, September 8, 2024
HomeతెలంగాణThangallapalli: రైస్ మిల్లుతో విద్యార్థులకు అవస్థలు

Thangallapalli: రైస్ మిల్లుతో విద్యార్థులకు అవస్థలు

మూసేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో గల కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ విద్యార్థి నాయకులు ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి కేజీబీవీ పాఠశాల ముందు ఉన్న వీరాంజనేయ రైస్ మిల్ ద్వారా కేజీవీబీ పాఠశాలలో చదువుకునే పిల్లలు చాలా అనారోగ్యకరమైన ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. రైస్ మిల్ నుండి వచ్చే దుమ్ము, దూళి, బూడిద, పొగతో విద్యార్థులకు శ్వాసకోశ, కంటి చూపు సమస్యలు తలెత్తి, అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులతో వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేయాలనీ కలెక్టర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కమ్ నాగరాజు తద్తరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News