Sunday, July 7, 2024
HomeతెలంగాణThimmapur: ఘనంగా పోశమ్మ బోనాలు

Thimmapur: ఘనంగా పోశమ్మ బోనాలు

మొక్కులు తీర్చుకున్న కవ్వంపల్లి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామంలో ఆదివారం పోశమ్మకు బోనాలు చేశారు. గ్రామానికి చెందిన రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించగా, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ, అమ్మవారి ఆశీర్వచనాలు గ్రామస్తులందరిపై ఉండేలా చూడాలని వేడుకున్నట్లు మొక్కుకున్నారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంది లక్ష్మీనారాయణ రెడ్డి, మండలాధ్యక్షుడు మొరపల్లి రమణారెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ తమ్మనవేణి రమేష్, సీనియర్ నాయకులు కాల్వ మల్లేశం, గోపు అనిల్ రెడ్డి, గోపు చంద్రశేఖర్ రెడ్డి, అనుమాసుల అఖిల్ రెడ్డి, తొర్తి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News