Friday, September 20, 2024
HomeతెలంగాణThirmalayapalem: బీసీ కార్పొరేషన్ రుణాలు విడుదల చేయాలి

Thirmalayapalem: బీసీ కార్పొరేషన్ రుణాలు విడుదల చేయాలి

అసెంబ్లీలో బీసీ ఎంబీసీ బడ్జెట్ కేటాయిస్తున్నారు తప్ప నిధులు విడుదల చేయడం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పిండిప్రోలు రామమూర్తి ఆరోపించారు. తిరుమలాయపాలెం మండల సమావేశం దమ్మాయిగూడెంలో జరిగిన సభలో.. బీసీలకు రుణాలు ఇవ్వడం లేదని బీసీ కుల ఫెడరేషన్లకు పైసా నిధులు ఇవ్వడం లేదని రజక నాయి బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ వడ్డెర పూసల వడ్డెర బట్రాజులు తదితర 11 కుల ఫెడరేషన్లు ఉన్నాయని యాదవులకు గొర్ల పంపిణీ చేయాలని పద్మశాలీలకు నూలు సబ్సిడీతో ఇవ్వాలని గౌడ్ కులస్తులకు మరణించినప్పుడు బీమా కాకుండా బతికున్నప్పుడే వసతులు కల్పించాలని వీరు డిమాండ్ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పిండిప్రోలు రామమూర్తి అధ్యక్షులు ఖమ్మం ఉమ్మడి జిల్లా మండల అధ్యక్షులు మేకల సైదులు యాదవ్, డివిజన్ అధ్యక్షులు గుండా గోవర్ధన్, డివిజన్ కార్యదర్శి అన్న బత్తుల కృష్ణ, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు పడిసిన బోయిన రమేష్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లగిశెట్టి మహేష్, యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాసాని బ్రహ్మం, ఖమ్మం నగర అధ్యక్షులు గద్దె వెంకటరామయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News