తిరుమలయపాలెం మండలంలో శుక్రవారం రాత్రి ఈదురు గాలులు, అకాల వర్షానికి వివిధ గ్రామాలలో
నేలకొరిగిన మొక్క జొన్న పంటను జిల్లా వ్యవసాయ అధికారుల ఆదేశాలు మేరకు క్షేత్ర స్థాయిలో శనివారం మండల వ్యవసాయాధికారి ఎన్ సీతారామరెడ్డి పరిశీలించారు. మండలంలో 318 రైతుల పంట 469 ఎకరాల విస్తీర్ణం నష్టపోయినట్టు ప్రాథమిక అంచనాగా గుర్తు చేశారు. అధిక మోతాదులో తాళ్ళచెరువు, తెట్టెలపాడు, తిరుమలాయపాలెం గ్రామాలలో నష్టపోయినట్టు ఆయన తెలిపారు. పూర్తినష్టాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంట నష్టాన్ని నమోదు చేస్తామని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.